కార్యకర్తలకు అండగా బీజేపీ

ABN , First Publish Date - 2020-08-09T10:46:11+05:30 IST

పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఆపద సమయంలో బీజేపీ అండగా నిలుస్తుం దని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి అన్నారు.

కార్యకర్తలకు అండగా బీజేపీ

విజయనగరం దాసన్నపేట:  పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు ఆపద సమయంలో బీజేపీ అండగా నిలుస్తుం దని  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భవిరెడ్డి శివప్రసాద్‌ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన దాడిలో తీవ్రంగా గాయాల పాలై కొలుకున్న నగరంలోని 21వ డివిజన్‌ కార్పొరేట్‌ అభ్యర్థి నారాయణరావును శనివారం బీజేపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా భవిరెడ్డి మాట్లాడుతూ.. నారాయణరావుపై జరిగిన దాడి చాలా తీవ్రమైనదని తెలిపారు. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులను కఠి నంగా శిక్షించాలని కోరారు.  ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లామని, ఎస్పీ రాజకుమారితో మాట్లాడే అవకాశం ఉందని తెలిపారు. బీజేపీ నేతలు పి.అశోక్‌, జి.కూర్మారావు,  గోపాలకృష్ణ ఉన్నారు. 

Updated Date - 2020-08-09T10:46:11+05:30 IST