కృష్ణాలో 30 థియేటర్లలో ఆగిన ‘భీమ్లానాయక్‌’

ABN , First Publish Date - 2022-02-26T02:25:02+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌ చిత్రాన్ని కృష్ణా జిల్లాలో అన్ని థియేటర్లలోనూ ప్రదర్శించలేదు. ఏ, బీ కేంద్రాల్లో ఉన్న థియేటర్లలో బొమ్మ పడినప్పటికీ సీ కేంద్రాల్లో

కృష్ణాలో 30 థియేటర్లలో ఆగిన ‘భీమ్లానాయక్‌’

విజయవాడ: పవన్‌ కల్యాణ్‌ భీమ్లానాయక్‌ చిత్రాన్ని కృష్ణా జిల్లాలో అన్ని థియేటర్లలోనూ ప్రదర్శించలేదు. ఏ, బీ కేంద్రాల్లో ఉన్న థియేటర్లలో బొమ్మ పడినప్పటికీ సీ కేంద్రాల్లో మాత్రం చిత్రాన్ని ప్రదర్శించలేదు. జిల్లాలో మొత్తం 80 థియేటర్ల వరకు ఉన్నాయి. సీ కేంద్రాలైన తిరువూరు, విస్సన్నపేట, హనుమాన్‌జంక్షన్‌, పెడన, మైలవరం ప్రాంతాల్లో ఉన్న 20 థియేటర్లలో మాత్రం చిత్రాన్ని విడుదల చేయలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు చిత్రాన్ని విడుదల చేసి, థియేటర్‌ను నిర్వహించలేమని ప్రదర్శకులు కచ్చితంగా తేల్చి చెప్పారు. మరోపక్క చిత్రాన్ని ప్రదర్శించాలని పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆందోళన చేశారు. అయినా ప్రదర్శకులు మాత్రం చిత్రాన్ని ప్రదర్శించడానికి ఆసక్తి చూపలేదు. ఇక్కడ నేల టికెట్‌ ధర రూ.10గా ఉండడం, ఈ ధరలకే టికెట్లు విక్రయించాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

Updated Date - 2022-02-26T02:25:02+05:30 IST