భిక్కనూరులో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2020-10-23T11:40:55+05:30 IST

ప్రైవేటు ఉద్యోగులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ గురువారం భిక్కనూరు మండల కేం ద్రంలోని సినిమా టాకీసు చౌరస్తాలో ఏబీవీపీ నాయ కులు ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేశారు

భిక్కనూరులో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

భిక్కనూరు, అక్టోబరు 21: ప్రైవేటు ఉద్యోగులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ గురువారం భిక్కనూరు మండల కేంద్రంలోని సినిమా టాకీసు చౌరస్తాలో ఏబీవీపీ నాయ కులు ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దహనం చేశారు. ఈ మేరకు ఏబీవీపీ మండల కన్వీనర్‌ సంజయ్‌ మాట్లా డుతూ ప్రైవేటు ఉద్యోగు లను ఆదుకోవాలని ఎన్ని సార్లు ప్రభుత్వానికి విన్న వించినా, వినతి పత్రాలు అందజేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రైవేటు ఉద్యోగు ల సమస్యలను పరిష్కరిం చి వారిని ఆదుకోవాలని లేని యెడల పెద్దఎత్తున ఆందోళన కార్య క్రమాలను చేపడుతామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రాజు, సందీప్‌, నిఖిల్‌, భాస్కర్‌, చందు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T11:40:55+05:30 IST