బాబు డైరెక్షన్‌లోనే రఘురామ, పవన్ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే శ్రీనివాస్

ABN , First Publish Date - 2021-05-15T18:51:43+05:30 IST

రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.

బాబు డైరెక్షన్‌లోనే రఘురామ, పవన్ వ్యాఖ్యలు: ఎమ్మెల్యే శ్రీనివాస్

ఏలూరు: రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. రోజూ రచ్చబండలో మాట్లాడుతున్న వ్యక్తికి తగిన శాస్తి జరిగిందన్నారు. జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయులు క్షత్రియులని.. క్షత్రియ సామాజిక వర్గానికి అపకీర్తి తెచ్చిన వ్యక్తి రఘురామ కృష్ణంరాజు అని వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో ప్రజల సమస్యలను కనీసం పట్టించుకోని, బాధ్యత లేని వ్యక్తి ఎంపీ రఘురామకృష్ణంరాజుఅని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే రఘురామకృష్ణంరాజు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రఘురామ రాజును అరెస్టు చేయడం ఆలస్యమైనా ఇప్పటికైనా ఏపీ సీఐడీ సరైన చర్య తీసుకుందని తెలిపారు. రఘురామకృష్ణంరాజు కుట్ర వెనుక భాగస్వాములైన వారిని కూడా విచారణ చేసి అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-15T18:51:43+05:30 IST