ఉపఎన్నికలు ముంచుకొస్తున్న నియోజక వర్గాలకు సీఎం వరాల జల్లు

ABN , First Publish Date - 2021-07-30T21:46:50+05:30 IST

తెలంగాణలో అనవార్య కారణాలతో ఉప ఎన్నికలు ముంచుకొస్తున్న నియోజకవర్గాలకు...

ఉపఎన్నికలు ముంచుకొస్తున్న నియోజక వర్గాలకు సీఎం వరాల జల్లు

భువనగిరి: తెలంగాణలో అనవార్య కారణాలతో ఉప ఎన్నికలు ముంచుకొస్తున్న నియోజకవర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటిస్తున్నారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధికి ఉపఎన్నికలే శరణ్యమన్న భావన ఏర్పడుతోంది. ఈ కారణంగా పదవిలో ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలన్న డిమాండ్‌ను బీజేపీ ఉధృతం చేస్తోంది. భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని, ఆ నియెజకవర్గం బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలో భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని, దాంతో నియోజక వర్గం అభివృద్ధి చెందుతుందని వారు వాదిస్తున్నారు.

Updated Date - 2021-07-30T21:46:50+05:30 IST