శ్మశానానికి భూమి సర్వే
ABN , First Publish Date - 2021-02-28T03:36:30+05:30 IST
మండలంలోని పెనుబల్లి పంచాయతీ పరిధిలోని సాల్మానుపురానికి శ్మశానం భూమి కోసం మండల సర్వేయర్ రమేష్బాబు, గ్రామ సర్వే
బుచ్చిరెడ్డిపాళెం,ఫిబ్రవరి27: మండలంలోని పెనుబల్లి పంచాయతీ పరిధిలోని సాల్మానుపురానికి శ్మశానం భూమి కోసం మండల సర్వేయర్ రమేష్బాబు, గ్రామ సర్వేయర్, ఆర్ఐ శనివారం భూమిని సర్వే చేశారు. శనివారం ఆంధ్రజ్యోతిలో ‘కొనుగోలు, అమ్మకాలతో చేతులు మారిన శివాయి భూమి’ అన్న శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ మేరకు సర్వేయర్లు భూమిని సర్వే చేసి 53సెంట్లు డొంక పోరంబోకుగా గుర్తించారు. సర్వే అధికారులతో పెనుబల్లి సర్పంచు ఊడా పెంచలయ్య, రఘురామయ్య, ప్రసాద్, వెంకటేష్, తదితరులు ఉన్నారు.