లోకే్‌షను కలిసిన భూమా విఖ్యాత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-06-19T05:43:21+05:30 IST

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకే్‌షను ఆళ్లగడ్డ టీడీపీ నాయకుడు భూమా విఖ్యాత్‌రెడ్డి శుక్రవారం కలిశారు.

లోకే్‌షను కలిసిన భూమా విఖ్యాత్‌రెడ్డి
నారా లోకేష్‌ను కలిసిన టీడీపీ నాయకుడు భూమా విఖ్యాత్‌రెడ్డి

ఆళ్లగడ్డ, జూన్‌ 18: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకే్‌షను ఆళ్లగడ్డ టీడీపీ నాయకుడు భూమా విఖ్యాత్‌రెడ్డి శుక్రవారం కలిశారు. గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ప్రతాపరెడ్డి, నాగార్జునరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణంగా హత్యకు గురికావడంతో అక్కడికి వచ్చిన నారా లోకే్‌షను భూమా విఖ్యాత్‌రెడ్డి కలిసి వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. సీఎం జగన్‌ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని విఖ్యాత్‌రెడ్డి ఆరోపించారు. ఈయన వెంట ఆళ్లగడ్డ టీడీపీ నాయకులు చాంద్‌బాషా, శేఖరరెడ్డి, బాచ్చాపురం శేఖరరెడ్డి ఉన్నారు. 




Updated Date - 2021-06-19T05:43:21+05:30 IST