భువనగిరి ఏరియా ఆస్పత్రిలో శిశువు విక్రయ కలకలం

ABN , First Publish Date - 2020-09-23T14:16:15+05:30 IST

భువనగిరి ఏరియా ఆసుపత్రిలో శిశు విక్రయం కలకలం రేపుతోంది.

భువనగిరి ఏరియా ఆస్పత్రిలో శిశువు విక్రయ కలకలం

యాదాద్రి-భువనగిరి: భువనగిరి ఏరియా ఆసుపత్రిలో శిశువు విక్రయం కలకలం రేపుతోంది. 10 రోజుల వయసు పసికందును కన్న తల్లి, ఆమె తల్లితో కలిసి రూ.60 వేలకు విక్రయించింది. భువనగిరి మండలానికి చెందిన ఓ యువతి ఈనెల 12న ఏరియా ఆసుపత్రికి ప్రసవానికి వచ్చింది. ప్రసవం అనంతరం పుట్టిన బిడ్డను ఘట్కేసర్ మండలానికి చెందిన వారికి యువతి తల్లి రూ.60 వేలకు విక్రయించింది. రెండు రోజుల క్రితం నేరేడ్‌మెట్ పోలీసులు ఓ కేసు విషయంలో ఓ ఇద్దరిని విచారించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో  పుట్టిన పాపను భువనగిరి టౌన్ పోలీసులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-09-23T14:16:15+05:30 IST