Big Breaking: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్
ABN , First Publish Date - 2022-04-07T02:37:50+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత ఏడాది చివరి నాలుగు నెలల్లో పెట్టిన ఎర్న్డ్ లీవ్స్ బిల్లులను ప్రభుత్వం వెనక్కి పంపింది. అలాగే డీఏ ఏరియర్స్ బిల్స్ను ప్రభుత్వం వెనక్కి పంపింది. నిధుల కొరతతో వెనక్కి పంపినట్టు అధికారులు చెబుతున్నారు. జిల్లా డ్రాయింగ్ అధికారుల లాగిన్ లోకి బిల్లులు వెనక్కి వచ్చాయి. బిల్లులు సమర్పించిన వెంటనే గత ఏడాదే ఇన్కమ్ టాక్స్ కట్ చేయడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. మళ్లీ బిల్లు వెనక్కి రావడంతో బిల్లును మళ్లీ సబ్మిట్ చేయాల్సి రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.