కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్వాసన పలికిన ఏపీ సర్కార్

ABN , First Publish Date - 2021-10-08T18:20:01+05:30 IST

కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్వాసన పలుకుతూ ప్రభుత్వం జీవో ఇచ్చింది.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్వాసన పలికిన ఏపీ సర్కార్

అమరావతి : కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్వాసన పలుకుతూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఎయిడెడ్ అధ్యాపకులను ప్రభుత్వంలోకి తీసుకోవడం వల్ల కాంట్రాక్ట్ అధ్యాపకులకు నష్టం ఉండదని గతంలో ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఈ సర్క్యూలర్‌తో 7 వందల మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని తొలగించింది. పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు మోసం చేశారని కాంట్రాక్ట్ అధ్యాపకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం ఆర్జేడీ కార్యాలయాల ఎదుట కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన చేపట్టనున్నారు.

Updated Date - 2021-10-08T18:20:01+05:30 IST