బంగారం షాపులో భారీచోరీ
ABN , First Publish Date - 2021-06-17T07:15:54+05:30 IST
టంగుటూరులోని కొండపి రోడ్డులో ఉన్న రంగా గోల్డ్షాపులో మంగళవారం రాత్రి చోరీ జరిగింది.
12 లక్షల విలువైన ఆభకరణాల చోరీ
షాపు వెనుక వైపు కన్నంవేసిన దొంగలు
ఘటనా స్థలం పరిశీలించి వివరాలు సేకరించిన పోలీసులు
టంగుటూరు, జూన్ 16 : టంగుటూరులోని కొండపి రోడ్డులో ఉన్న రంగా గోల్డ్షాపులో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షాపు వెనుకవైపు గోడకు కన్నం వేసి షాపులో చొరబడి దాదాపు రూ.12లక్షల విలువైన 596గ్రాముల ఆభరణాలను చోరీ చేశారు. విషయం తెలుసుకున్న ఏఎస్పీ రవిచంద్ర, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, సీసీఎస్ డీఎస్పీ దుర్గాప్రసాద్ చోరీ జరిగిన షాపును బుధవారం పరిశీలించారు. షాపు నిర్వాహకుని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్, క్లూస్టీం సభ్యులు వేలిముద్రలు ఇతర నేర పరిశోధనలో ఉపకరించే సమాచారాన్ని సేకరించారు. షాపు యజమాని జలదంకి రంగారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నయూబ్ రసూల్ తెలిపారు.