Begusarai Mass Shooting: బీహార్లో జంగిల్రాజ్ తిరిగొచ్చిందా?
ABN , First Publish Date - 2022-09-15T03:34:33+05:30 IST
పాట్నా: బీహార్లో ఆటవిక రాజ్యం తిరిగివచ్చిందా? బెగుసరాయ్లో జరిగిన తాజా ఘటన దీన్ని నిజం చేస్తోంది.
పాట్నా: బీహార్లో ఆటవిక రాజ్యం తిరిగివచ్చిందా? బెగుసరాయ్లో జరిగిన తాజా ఘటన దీన్ని నిజం చేస్తోంది. బెగూసరాయ్లోని 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో బైకులపై వెళ్తూ కొందరు దుండగలు రోడ్లపై నిల్చున్న వ్యక్తులను కాల్చారు. ఈ కాల్పుల ఘటనలో ఒకరుు మృతి చెందారు.
9 మందికి గాయపడ్డారు. 30 కిలోమీటర్ల పాటు ఈ కాల్పులు కొనసాగాయి. కనీసం 40 నిమిషాల పాటు ఈ కాల్పులు కలకలం సృష్టించాయి.
ఘటన దేశవ్యాప్తంగా దుమారం సృష్టించడంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దుండగులను గుర్తించేందుకు మూడు టీమ్లను ఏర్పాటు చేశారు. దుండగుల ముఖాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. అయితే వారంతా ఇంకా అరెస్ట్ కాలేదని తెలుస్తోంది.
అసలు కాల్పులు ఎందుకు జరపాల్సివచ్చింది. పైగా రోడ్లపైన ఉన్న సామాన్య జనాన్ని ఎందుకు లక్ష్యం చేసుకోవాల్సి వచ్చిందనే విషయంపై పోలీసులు ఫోకస్ చేశారు. 40 నిమిషాల పాటు మెయిన్ రోడ్లపై దుండగులు చేసిన విచక్షణారహిత కాల్పులు బీహార్ అంటే బీహారర్ అని మరోసారి నిరూపించాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.