బీహార్‌లో దారుణం...పొదల్లో బాలిక మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2020-10-20T14:47:29+05:30 IST

బీహార్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. షియోహర్ జిల్లా తరియానీ పోలీసుస్టేషను పరిధిలోని పొదల్లో ఓ బాలిక మృతదేహం వెలుగుచూసింది....

బీహార్‌లో దారుణం...పొదల్లో బాలిక మృతదేహం లభ్యం

పాట్నా(బీహార్): బీహార్ రాష్ట్రంలో మరో దారుణం వెలుగుచూసింది. షియోహర్ జిల్లా తరియానీ పోలీసుస్టేషను పరిధిలోని పొదల్లో ఓ బాలిక మృతదేహం వెలుగుచూసింది. బాలికపై అత్యాచారం చేసి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పొదల్లో ఉన్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం తరలించారు. సంఘటన స్థలానికి పోలీసు జాగిలాలతోపాటు ప్రత్యేక పోలీసు బృందం చేరింది. బాలిక బంధువులు, స్థానికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.బాలిక హత్య ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని షియోహర్ ఎస్పీ సంతోష్ కుమార్ చెప్పారు.

Updated Date - 2020-10-20T14:47:29+05:30 IST