బిహార్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా!
ABN , First Publish Date - 2021-04-22T07:41:34+05:30 IST
బిహార్లో పంచాయతీ ఎన్నిక లు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతుండడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. 15 రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి...
- కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ నిర్ణయం
పట్నా, ఏప్రిల్ 21: బిహార్లో పంచాయతీ ఎన్నిక లు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతుండడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. 15 రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. బిహార్లో జూన్ 15లోగా అన్ని స్థానిక సంస్థలకూ ఎన్నికలు పూర్తికావాల్సి ఉండగా.. ఈ నెలాఖరులో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.