ఇల్లు కొనేందుకు భార్య అకౌంట్లో రూ.39 లక్షలు దాచిన భర్త.. సడన్‌గా ఆమె అదృశ్యం.. బ్యాంకు ఖాతా చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2021-08-26T01:22:25+05:30 IST

భార్యపై నమ్మకంతో ఆమె అకౌంట్లో 39 లక్షలు వేస్తే..భర్తకు ఊహించని షాక్

ఇల్లు కొనేందుకు భార్య అకౌంట్లో రూ.39 లక్షలు దాచిన భర్త.. సడన్‌గా ఆమె అదృశ్యం.. బ్యాంకు ఖాతా చెక్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: వారిది అన్యోన్య దాంపత్యం..! భర్తకు భార్యపై అపారమైన ప్రేమ, నమ్మకం. వారికి ఇద్దరు పిల్లలకు కూడా ఉన్నారు! భార్యాపిల్లలను సొంత గ్రామంలోనే ఉంచి అతడు మాత్రం ఉద్యోగం నిమిత్తం మరో ప్రాంతంలో ఉండేవాడు.  ఈ క్రమంలో భర్త ఇటీవల తన పొలాన్ని అమ్మేసి.. అలా వచ్చిన డబ్బును భార్య పేర ఉన్న బ్యాంక్ అకౌంట్లో వేశాడు. ఆ తరువాత తన పనిమీద వెళ్లిపోయాడు.


ఇటీవలే భార్యాబిడ్డలను చూసుకునేందుకు తన ఇంటికి వెళ్లగా..అక్కడ వారి జాడకనిపించలేదు. అదే సమయంలో..ఆమె బ్యాంకులో డబ్బులు కూడా మాయమైపోయినట్టు అతడు గ్రహించాడు. తాను దారుణంగా మోసపోయినట్టు అతడికి అర్థమైంది..కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అతడికి అనిపించింది.  అసలు ఏం జరిగిందంటే..


బ్రజ్ కిషోర్‌కు 14 ఏళ్ల క్రితం పెళ్లైంది. భార్య పేరు ప్రభావతీ దేవి. వారికి ఇద్దరు పిల్లలు. బిహార్‌లోని పట్నా జిల్లాలోగల బిహ్‌టా మండలం పరిధిలోని ఓ చిన్న గ్రామంలో వారు నివిస్తుంటారు. పిల్లలకు పెద్దవాళ్లవుతున్న నేపథ్యంలో వారికి మంచి చదువులు చెప్పించాలని కిషోర్ దంపతులు నిర్ణయించారు. ఈ క్రమంలో..పెద్దనగరంలో కాపురం పెడితే పిల్లల చదువుకు అనువుగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చారు. కాగా.. కిషోర్ తన భార్యా పిల్లలను అదే గ్రామంలో ఓ అద్దె ఇంట్లో ఉంచి అతడు మాత్రం ఉద్యోగం నిమిత్తం గుజరాత్‌లో ఉండేవాడు అప్పుడప్పుడు భార్యాపిల్లలను చూసేందుకు గ్రామానికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో అతడి జీవితంలో ఓ అనర్థం జరిగింది. అతడి భార్య పొరిగింటి యువకుడికి దగ్గరైయ్యింది. తన భర్తకు అసలు ఏమాత్రం అనుమానం రాకుండా.. మొత్తం వ్యవహారం నడిపింది. 


ఓ రోజున..ఏమీ ఎరుగనట్టు ప్రభావతి భర్త ముందుకు ఓ ప్రతిపాదన తెచ్చింది. ‘‘మనం ఎలాగూ నగరానికి వెళ్లిపోదామనుకుంటున్నాం కాబట్టి అక్కడే ఓ సొంతిల్లు కొనుక్కుంటే ఎలా ఉంటుందో అలోచించండి’’ అని భర్తకు చెప్పింది. అతడికీ ఆ ఆలోచన నచ్చడంతో వెంటనే తనకున్న పోలాన్ని అమ్మేశాడు. అలా చేతికొచ్చిన రూ. 39 లక్షలను భార్య పేర ఉన్న బ్యాంక్ అకౌంట్లో వేశాడు. ఆ తరువాత.. యథాప్రకారం తన పనిమీద వెళ్లిపోయాడు. ఇటీవలే మరోసారి భార్య పిల్లలను చూసుకునేందుకు గ్రామానికి వచ్చాడ్డు. కానీ ఇంటికి మాత్రం తాళం పెట్టి ఉండటంతో అతడికి మొదట అసలేమీ పాలుపోలేదు. దీంతో..ఇంటి యజమానిని వాకబు చేశాడు.


‘‘మీ ఆవిడ రెండు రోజుల క్రీతమే తన పిల్లలను తీసుకుంది వెళ్లిపోయింది. ఎక్కడికి వెళుతున్నదీ నాకైతే చెప్పలేదు’’ అని ఇంటి యజమాని అన్నాడు. దీంతో..కిషోర్ ఒక్కసారిగా షాకయ్యాడు. ఎందుకో అనుమానమొచ్చి.. భార్య బ్యాంక్ అకౌంట్‌ వివరాలు చూస్తే.. అందులో కేవలం 11 రూపాయలు మాత్రమే మిగిలినట్టు బయటపడింది. దీంతో.. లబోదిబోమంటూ అతడు పోలీసులను ఆశ్రయించాడు. అయితే.. ప్రభావతీ దేవీ మరోవ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం పోలీసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. దీంతో..ఆమె ఆచూకీ తెలుకునేందుకు వారు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. 

Updated Date - 2021-08-26T01:22:25+05:30 IST