మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో బర్డ్ ఫ్లూ
ABN , First Publish Date - 2021-01-17T08:12:14+05:30 IST
మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూను గుర్తించినట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. మధ్యప్రదేశ్,
న్యూఢిల్లీ, జనవరి 16: మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూను గుర్తించినట్లు కేంద్రం శనివారం ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఛత్తీ్సగఢ్ రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో వైరస్ సోకిన కోళ్లను వధిస్తున్నారని పేర్కొంది. ఉత్తరాఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కాకుల్లో, ఢిల్లీలో పావురాలు, గుడ్లగూబ, కొంగల్లో బర్డ్ ఫ్లూను గుర్తించారు.
అయితే.. రాష్ట్ర ప్రభుత్వాలు చికెన్ అమ్మకాన్ని నిషేధించాలన్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని, బర్డ్ ఫ్లూ లేని చోట్ల చికెన్ అమ్మకానికి అనుమతినివ్వాలని కేంద్రం సూచించింది.
కాగా.. ‘బ్రౌన్ఫి్ష’ అనే గుడ్లగూబ అవశేషాల నుంచి సేకరించిన నమూనాల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు తేలిందని ఢిల్లీ జూ తెలిపింది. ఇప్పటికే నగరంలో కాకులు, ఇతర పక్షులు భారీ సంఖ్యలో మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో జూలో శానిటైజేషన్ డ్రైవ్ చేపట్టామని నిర్వాహకులు తెలిపారు.