Viral Video: వేదికపై నవవధూవరులు చేసిన పనికి బంధువులు షాక్!

ABN , First Publish Date - 2022-05-01T19:44:39+05:30 IST

అందంగా ముస్తాబై ఫొటోల కోసం స్టేజీపైకి చేరుకున్న నవవధువులకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వేదికపై ఆ నవదంపతులు చేసిన పని బంధువులనే కాకుండా నెటిజన్లను కూడా ఆశ్చ

Viral Video: వేదికపై నవవధూవరులు చేసిన పనికి బంధువులు షాక్!

ఇంటర్నెట్ డెస్క్: అందంగా ముస్తాబై ఫొటోల కోసం స్టేజీపైకి చేరుకున్న నవవధువులకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వేదికపై ఆ నవదంపతులు చేసిన పని బంధువులనే కాకుండా నెటిజన్లను కూడా ఆశ్చర్యపరుస్తోంది. దీంతో నెటిజనులు స్పందిస్తూ రకరకాలు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



యువతి, యువకుడు ఒకరికొకరు నచ్చడంతో వారికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఇందులో భాగంగానే పెళ్లి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. వివాహం కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే బంధువులు, మిత్రులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభంగా వివాహం జరిగింది. అనంతరం వధూవరులు ఇద్దరూ ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ మీదకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే వరుడికి వధువు మిఠాయి తినిపించేందుకు ప్రయత్నించింది. అయితే వరుడు మాత్రం ఆ విషయాన్ని గమనించకుండా.. మరోవైపు చూస్తూ ఉండిపోయాడు. దీంతో ఆ వధువు చిర్రెత్తుకొచ్చి.. మిఠాయిని వరుడి ముఖానికి రుద్దేసింది. వధవు చేసిన పనికి ఆగ్రహానికి గురైన వరుడు.. వధువు చెంప చెల్లుమనిపించాడు. వధువు కూడా ఏ మాత్రం తగ్గలేదు.. అంతే బలంగా వరుడిపై చేయి చేసుకుంది. వధూవరులు అలా కొట్టుకోవడం చూసి అక్కడ ఉన్న బంధువులు కంగుతిన్నారు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. 




Updated Date - 2022-05-01T19:44:39+05:30 IST