రేవ్ పార్టీ తరహా బర్త్డే పార్టీ నిర్వాహకులపై కేసు
ABN , First Publish Date - 2021-06-15T12:36:42+05:30 IST
ఓ ఫామ్హౌస్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి బర్త్డే వేడుకలు..
- 47 మద్యం బాటిళ్లు, సౌండ్ సిస్టం సీజ్
- వేడుకల్లో పాల్గొన్న 64 మందిపై కూడా..
హైదరాబాద్ సిటీ/శంషాబాద్: రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రం సమీపంలోని ఓ ఫామ్హౌస్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి బర్త్డే వేడుకలు నిర్వహించిన నలుగురు నిర్వాహకులతోపాటు వేడుకల్లో పాల్గొన్న 64 మందిపై కేసు నమోదు చేసినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకా్షరెడ్డి తెలిపారు. శంషాబాద్లోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. లాక్డౌన్ నిబంధనలతో పాటు మద్యం సరఫరా చేసిన వారిపై ఎక్సైజ్ యాక్ట్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లు తెలిపారు. నిర్వాహకులు భరత్, జీషాన్అలీఖాన్, అన్వేష్, వరుణ్గౌడ్లపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఫామ్ హౌజ్లో 47 మద్యం బాటిళ్లు, ఒక సౌండ్ సిస్టంను సీజ్ చేసినట్టు తెలిపారు. 64 మంది నిందితుల్లో 21 మంది మహిళలు ఉన్నారని వివరించారు. నిందితులందరూ హైదరాబాద్కు చెందిన వారేనని తెలిపారు.