బిర్యానీ దుకాణంలో మాదకద్రవ్యాల విక్రయం
ABN , First Publish Date - 2022-07-02T14:30:39+05:30 IST
స్థానిక పల్లావరంలో బిర్యానీ దుకాణంలో కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పల్లావరం కంటోన్మెంట్
- ముగ్గురి అరెస్టు
పెరంబూర్(చెన్నై), జూలై 1: స్థానిక పల్లావరంలో బిర్యానీ దుకాణంలో కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పల్లావరం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన జహరుల్లా తనకు సొంతమైన బిర్యానీ దుకాణంలో ఉదయం, సాయంత్రం వేళల్లో కళాశాల విద్యార్థులకు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు ఆ దుకాణంలో తనిఖీలు చేపట్టారు. దుకాణంలో పలురకాల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకొని జహరుల్లా, అతడి స్నేహితులు పౌల్, ఉదయశీలన్లను అరెస్ట్ చేశారు.