దోషులను అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2022-05-20T04:44:19+05:30 IST

యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రహదారి మాత దేవాలయంపై ఈనెల 14న రాత్రి దాడి చేసిన దుండగులను తక్షణం అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు ఆర్‌సీఎం బిషప్‌ భాగ్యయ్య డిమాండ్‌ చేశారు.

దోషులను అరెస్టు చేయాలి
గుంటూరులోని మదర్‌థెరిస్సా విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న బిషప్‌ భాగ్యయ్య, ఫాదర్లు

శాంతి ర్యాలీలో బిషప్‌ భాగ్యయ్య డిమాండ్‌

మరియమాత విగ్రహంపై దాడికి గుంటూరులో నిరసన 

గుంటూరు, మే 19: యడ్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రహదారి మాత దేవాలయంపై  ఈనెల 14న రాత్రి దాడి చేసిన దుండగులను తక్షణం అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు ఆర్‌సీఎం బిషప్‌ భాగ్యయ్య డిమాండ్‌ చేశారు. ఆలయంపై దాడిని నిరసిస్తూ గురువారం గుంటూరులో క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. లక్ష్మీపురం సెంటర్‌లోని మదర్‌థెరిస్సా విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యడ్లపాడు పరిధిలోని రహదారి మాత ఆలయంలో మరియమాత, ఏసుక్రీస్తు, బాలయేసు విగ్రహాలను ధ్వంసం చేయడం క్రైస్తవ సమాజాన్ని తీవ్రంగా బాధించిందన్నారు. దుండగులు మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు మరియమాత విగ్రహానికి తాళి కట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా క్షేమంగా ఉండాలని తాము ఆలయంలో ప్రార్థిస్తున్నామన్నారు. అటువంటి ఆలయంపై సంఘ విద్రోహ శక్తులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఘటన జరిగి మూడు రోజులు గడిచినా కనీసం ఇంతవరకు నిందితులను గుర్తించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫాదర్లు బాల, ఇన్నారెడ్డి, సుందరరావు, మద్దు బాలస్వామి, చుక్కా చంద్రపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-20T04:44:19+05:30 IST