క్రీస్తు బోధనలు అనుసరణీయం
ABN , First Publish Date - 2021-12-04T05:28:50+05:30 IST
ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని గుంటూరు మైత్రాసన పీఠాధిపతుతి బిషప్ భాగ్యయ్య అన్నారు.
బిషప్ భాగ్యయ్య
వట్టిచెరుకూరు, డిసెంబరు3: ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని గుంటూరు మైత్రాసన పీఠాధిపతి బిషప్ భాగ్యయ్య అన్నారు. ముట్లూరు గ్రామంలో పునీతశౌరి వారి తిరునాళ్ళ మహోత్సవం చివరి రోజైన శుక్రవారం సమష్టి దివ్యబలి పూజా కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై భక్తులకు సందేశం ఇచ్చారు. రాగద్వేషాలకు అతీతంగా జీవించాలని సూచించారు. ముట్లూరు విచారణ గురువు, దిలీప్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.