బిట్రగుంటలో రైల్వే జీఎం తనిఖీలు

ABN , First Publish Date - 2022-05-22T03:04:51+05:30 IST

బిట్రగుంట రైల్వేస్టేషన్‌ను శనివారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రైల్వేస్టేషన్‌లో

బిట్రగుంటలో రైల్వే జీఎం తనిఖీలు
బిట్రగుంట రైల్వేస్టేషన్లో రికార్డులను తనిఖీ చేస్తున్న జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌

బిట్రగుంట, మే 21: బిట్రగుంట రైల్వేస్టేషన్‌ను శనివారం సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. రైల్వేస్టేషన్‌లోని రికార్డులను పరిశీలించిన జీఎం పేనల్‌ బోర్డు పనితీరుపై అధికారులతో చర్చించారు. క్రూ కంట్రోల్‌ లాబీని తనిఖీ చేసి  ఇన్‌చార్జితో మాట్లాడారు. డ్రైవర్లు, గార్డుల వసతి గృహంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. రైలు క్రాసింగ్‌ పాయింట్లపై చర్చించారు. బిట్రగుంట రైల్వే సెక్షన్‌ పరిధిలోని మూడోలైన్‌ను శ్రీవెంకటేశ్వరపాలెం వరకు పరిశీలించారు.  కార్యక్రమంలో  విజయవాడ డీఆర్‌ఎం శివేంద్రప్రసాద్‌, సీనియర్‌ డీసీఎం రాంబాబు, సేఫ్టీ అధికారులు, డివిజనల్‌ అధికారులు, స్టేషన్‌ మాస్టర్‌ ఎల్సీ మీనాకుమార్‌, క్రూ కంట్రోల్‌ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T03:04:51+05:30 IST