కావలసినవి: కాకరకాయలు - ఎనిమిది, పెరుగు - అరకప్పు, పసుపు - అర టీస్పూన్, అల్లం పొడి - అర టీస్పూన్, ధనియాల పొడి - ఒక టేబుల్స్పూన్, ఉప్పు - తగినంత, జీలకర్ర - ఒక టీస్పూన్, ఇంగువ - చిటికెడు, మెంతులు - అర టీస్పూన్, ఆవాల నూనె - పావు కప్పు.
తయారీ: ముందుగా జీలకర్ర, మెంతులను వేగించాలి. కాకరకాయలపై గరుకుగా ఉన్న పొట్టు తీసేసి, ముక్కలను ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. కాకరకాయలను పిండి నీటిని తీసేస్తే చేదు పోతుంది. పాత్రలో పెరుగు తీసుకొని అందులో పసుపు, కారం, వేగించిన జీలకర్ర, మెంతులు, ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి. స్టవ్పై పాన్ పెట్టి నూనె వేసి కాస్త వేడయ్యాక కాకరకాయలు వేసి కాసేపు వేగించుకుని పక్కన పెట్టాలి. అదే పాన్లో కాస్త నూనె వేసి పెరుగు మిశ్రమం వేయాలి. తరువాత కాకరకాయ ముక్కలు వేసి కలుపుకొని వేగించాలి. ఉడుకుతున్న సమయంలో మధ్యమధ్యలో కలియబెడితే రుచికరమైన పెరుగు కర్రీ రెడీ అవుతుంది. అన్నంలోకి ఈ కర్రీ రుచిగా ఉంటుంది.