BJP Vs TRS: జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలు

ABN , First Publish Date - 2022-08-17T16:03:15+05:30 IST

జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ప్లెక్సీలు, ప్రచార హోర్డింగ్స్ వెలిశాయి.

BJP Vs TRS: జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ పోటాపోటీ ఫ్లెక్సీలు

జనగామ: జనగామలో బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) పోటాపోటీగా ప్లెక్సీలు, ప్రచార హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay)కు సవాల్ విసురుతూ టీఆర్‌ఎస్ నేతలు (TRS Leaders) హోర్డింగ్స్ పెట్టారు. జనగామలో అడుగుపెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి (Mutti reddy) ఈ హోర్డింగ్స్‌లను  ఏర్పాటు చేశారు. మరోవైపు బండి సంజయ్‌కు స్వాగతం పలుకుతూ బీజేపీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా... కొన్ని బీజేపీ ప్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. అయితే టీఆర్ఎస్ నాయకులే చించారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పోటాపోటీ విమర్శలు, ప్లెక్సీల నేపథ్యంలో జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ జనగామ నియోజకవర్గంలోకి బండి సంజయ్ పాదయాత్ర చేరుకోనుంది. 

Updated Date - 2022-08-17T16:03:15+05:30 IST