ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ

ABN , First Publish Date - 2022-04-14T23:25:03+05:30 IST

ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముప్పేట దాడి చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ

అమరావతి: ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముప్పేట దాడి చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు భేటీ అయ్యారు. ఈనెలలో రాష్ట్రంలో కేంద్ర మంత్రుల పర్యటించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈనెల 17న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయవాడకు రానున్నారు. ఆ తర్వాత ఈ నెల 25న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కడపకు రానున్నారు. ఈనెల చివరి వారంలో విశాఖకు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-04-14T23:25:03+05:30 IST