Telangana BJP: ఇంఛార్జ్, కో ఇంఛార్జ్లను నియమించిన అధిష్టానం
ABN , First Publish Date - 2022-09-10T00:55:54+05:30 IST
న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీకి ఇంఛార్జ్, కో ఇంఛార్జ్లు నియమితులయ్యారు. తరుణ్ చుగ్ ఇంఛార్జ్గా, అరవింద్ మీనన్ కో ఇంఛార్జ్గా నియమిస్తూ
న్యూఢిల్లీ: తెలంగాణ బీజేపీకి ఇంఛార్జ్, కో ఇంఛార్జ్లు నియమితులయ్యారు. తరుణ్ చుగ్ ఇంఛార్జ్గా, అరవింద్ మీనన్ కో ఇంఛార్జ్గా నియమిస్తూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు ఇంఛార్జ్, కో ఇంఛార్జ్లను నియమించింది. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ను హర్యానా ఇంఛార్జ్గా, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీని పంజాబ్ ఇంఛార్జ్గా నియమించింది. పశ్చిమబెంగాల్కు బీహార్ మాజీ మంత్రి మంగళ్ పాండేను నియమించారు. ఇక జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రను ఈశాన్య రాష్ట్రాల కోఆర్డినేటర్గా నియమించారు.