TS News: బీజేపీ సభను అడ్డుకునేందుకు కుట్ర చేశారు: సంజయ్
ABN , First Publish Date - 2022-08-27T00:06:50+05:30 IST
బీజేపీ (BJP) సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేశారని ఆ పార్టీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ధ్వజమెత్తారు.
హనుమకొండ: బీజేపీ (BJP) సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేశారని ఆ పార్టీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కారణం లేకుండా సభను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని మండిపడ్డారు. తన పాదయాత్రపై దాడికి ప్రయత్నించారని, ఈ ఘర్షణను బూచీగా చూపి పాదయాత్ర, సభను అడ్డుకోవాలనుకున్నారని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ (CM KCR) కుటుంబ అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకూడదనే.. సభకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశారని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతిచ్చింది. రేపు వరంగల్ (Warangal)లో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర ముగింపు సభను నిలుపుదల చేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసింది. బీజేపీ సభకు అనుమతి ఇవ్వాలని వరంగల్ సీపీకి హైకోర్టు ఆదేశించింది. సభకు ఎంతమంది హాజరవుతారో ముందే సమాచారం ఇవ్వాలని కోర్టు సూచించింది. సభకు సంబంధించి బీజేపీ నుంచి అండర్ టేకింగ్ తీసుకోవాలని, వరంగల్ సీపీ తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.