ముస్లిం ఓట్ల కోసం Rss మైనారిటీ విభాగం యత్నాలు

ABN , First Publish Date - 2022-01-15T18:00:21+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలో ఓట్లు పొందడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ మైనారిటీ విభాగం, బీజేపీ ముస్లిం...

ముస్లిం ఓట్ల కోసం Rss మైనారిటీ విభాగం యత్నాలు

లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలో ఓట్లు పొందడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ మైనారిటీ విభాగం, బీజేపీ ముస్లిం రాష్ట్రీయ మంచ్ లు యత్నాలు ప్రారంభించాయి. ముస్లిం,మైనారిటీల శ్రేయోభిలాషి బీజేపీ అని ఆ పార్టీ ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతలు చెప్పారు. ముస్లిం ఓటర్లలో చైతన్యం నింపేందుకు 400 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారని ముస్లిం రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్ షాహిద్ సయీద్ చెప్పారు. యోగి, మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై ముస్లిం మంచ్ ప్రచారం చేపట్టింది. ముస్లింల ఓట్లు బీజేపీకి దక్కేలా తాము ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశామని షాహిద్ సయీద్ వివరించారు. 

Updated Date - 2022-01-15T18:00:21+05:30 IST