లాలూపై వేధింపులకు కారణం చెప్పిన ప్రియాంక

ABN , First Publish Date - 2022-02-18T21:30:57+05:30 IST

బీజేపీకి తలవంచని ఎవరైనా సరే వేధింపులకు గురికావాల్సిందేనని, అదే బీజేపీ రాజకీయాల్లో ప్రత్యేకత అని..

లాలూపై వేధింపులకు కారణం చెప్పిన ప్రియాంక

న్యూఢిల్లీ: బీజేపీకి తలవంచని ఎవరైనా సరే వేధింపులకు గురికావాల్సిందేనని, అదే  బీజేపీ రాజకీయాల్లో ప్రత్యేకత అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. పశుగ్రాసం కుంభకోణంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల దోషిగా నిర్ధారించిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్  యాదవ్‌కు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.


''బీజేపీ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్‌లో కీలకాంశం ఒకటుంది. ఎవరైతే తలవంచరో (పార్టీ ముందు) వాళ్లని వేధిస్తుంటారు. రాజకీయాల్లో రాజీలేని ధోరణి కారణంగానే లాలూ ప్రసాద్ యాదవ్‌ లక్ష్యంగా దాడి జరిగింది. ఆయనకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నాను'' అని ఆ ట్వీట్‌లో ప్రియాంక పేర్కొన్నారు. డొరాండా ట్రెజరీ నుంచి అక్కమంగా సొమ్ములు విత్‌డ్రా చేసుకున్నారనే ఆరోపణల్లో లాలూను దోషిగా రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారంనాడు ప్రకటించింది. ఇది పశుగ్రాసం కుంభకోణంలోని ఐదో కేసు కాగా, ఇంతకుముందే నాలుగు కేసుల్లోనూ లాలూ దోషిగా తేలారు.

Updated Date - 2022-02-18T21:30:57+05:30 IST