‘ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ కార్యకర్తల అజెండా కావాలి’
ABN , First Publish Date - 2020-11-27T06:07:05+05:30 IST
రెండు రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్న అసెంబ్లీ స్థాయి బీజేపీ సంస్థాగత ప్రశిక్షణ తరగతులు గురువారం ముగిశాయి.
పాయకరావుపేట, నవంబరు 26 : రెండు రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్న అసెంబ్లీ స్థాయి బీజేపీ సంస్థాగత ప్రశిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. పార్టీ నాయకులు తోట నగేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తరగతుల్లో రెండో రోజు సీనియర్ నాయకులు పుట్టా గంగయ్య మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు తదితరాలపై అవగాహన కల్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి.సత్యనారాయణ, నగేశ్, పోర్టు డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, కేశవకాంత్, కొండబాబు తదితరులు కార్యర్తలకు దిశానిర్దేశం చేశారు.