ఇసుక మాఫియాను అడ్డుకోవాలి

ABN , First Publish Date - 2021-07-24T07:33:02+05:30 IST

రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా ను అరికట్టి భవన నిర్మాణ కార్మికులతోపాటు సామాన్య ప్రజలను ఆదుకోవాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

ఇసుక మాఫియాను అడ్డుకోవాలి
బీజేవైఎం నాయకులతో బైరెడ్డి శబరి

బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శబరి

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), జూలై 23 : రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా ను అరికట్టి భవన నిర్మాణ కార్మికులతోపాటు సామాన్య ప్రజలను ఆదుకోవాలని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బైరెడ్డి శబరి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా పాల్గొన్న శబరి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అఽధికార పార్టీ నేతల ఇసుక దందాకు హద్దులు లేకుండా పోయాయని విమర్శించారు. అమలకు సాధ్యంకాని హామీలతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారన్నారు. బీజేవైఎం బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎర్రబోలు రాజేష్‌, శ్రీనివాసులు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు యశ్వంత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T07:33:02+05:30 IST