న్యాయవాదుల హత్యను ఖండిస్తూ బీజేపీ కార్పొరేటర్ల ధర్నా

ABN , First Publish Date - 2021-02-18T21:03:46+05:30 IST

న్యాయవాదుల దంపతుల హత్యకు నిరసనగా బీజేపీ మహిళా విభాగం ధర్నా చేపట్టారు.

న్యాయవాదుల హత్యను ఖండిస్తూ బీజేపీ కార్పొరేటర్ల ధర్నా

హైదరాబాద్: న్యాయవాదుల దంపతుల హత్యకు నిరసనగా బీజేపీ మహిళా విభాగం, హైదరాబాద్ కార్పొరేటర్లు అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ అన్యాయం గురించి ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా? అంటూ మండిపడ్డారు. చనిపోయే ముందు వామన్‌రావు మరణ వాంగ్మూలం ఇచ్చినా నేరస్తులపై సరైన చర్యలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని వాటికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యలు ప్రభుత్వ పోలీసు దమననీతికి పరాకాష్ట అని మహిళా నాయకులు మండిపడ్డారు.

Updated Date - 2021-02-18T21:03:46+05:30 IST