త్యాగాలు BJPకి అవసరం లేదు: సోము వీర్రాజు

ABN , First Publish Date - 2022-05-09T01:35:30+05:30 IST

ఇతర పార్టీలు చేసే త్యాగాలు బీజేపీకి అవసరం లేదని, ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఆ త్యాగాలను గమనించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

త్యాగాలు BJPకి అవసరం లేదు: సోము వీర్రాజు

విజయవాడ: ఇతర పార్టీలు చేసే త్యాగాలు బీజేపీకి అవసరం లేదని, ఇంతకుముందు అనేక సందర్భాల్లో ఆ త్యాగాలను గమనించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) అన్నారు. ఇక మళ్లీ ఆ త్యాగాలను గమనించడానికి తాము సిద్ధంగా లేమని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు. చంద్రబాబు పేరు ఎత్తకుండానే త్యాగాల గురించి మాట్లాడారు. ‘‘ఇటీవల కొంతమంది త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. చాలా సందర్భాల్లో ఆ త్యాగాలను గమనించాం. వాటిని గమనించడానికి ఏపీలో సిద్ధంగా లేం. బీజేపీ (BJP) వద్ద అభివృద్ధి, సంక్షేమం ఉన్నాయి. అటువంటప్పుడు దేనికి త్యాగం చేయాలి? ఆ పార్టీల వద్ద అవినీతి ఉందని త్యాగం చేయాలా?’’ అని ప్రశ్నించారు. అవినీతి రాజకీయ పార్టీలకు, కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల వద్దకు తీసుకెళ్లే హక్కు, దమ్ము బీజేపీకి ఉన్నాయని చెప్పారు. మోదీ (Modi) నాయకత్వంలోనే 2024లో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

Read more