సీఎం కుమారుడైనంత మాత్రన బీజేపీ టిక్కెట్ ఇవ్వదు: ఫడ్నవీస్
ABN , First Publish Date - 2022-01-14T01:35:09+05:30 IST
సీఎం కుమారుడైనంత మాత్రన బీజేపీ టిక్కెట్ ఇవ్వదు: ఫడ్నవీస్
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి కుమారుడికి బీజేపీ షాక్ ఇచ్చింది. గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ కుమారుడన్న కారణంగానే పార్టీ ఎవరికీ టికెట్ ఇవ్వదని బీజేపీ గోవా ఇన్ఛార్జ్, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గోవా ఎన్నికలకు పనాజీ నుంచి పారికర్ కుమారుడు ఉత్పల్ టికెట్ కోరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గోవాలో బీజేపీని స్థాపించడానికి పారికర్ పనిచేశారని ఆయన అన్నారు.