టీడీపీ నేతతో బీజేపీ పెద్దల మంతనాలు

ABN , First Publish Date - 2021-10-18T05:58:38+05:30 IST

బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురే్‌షకు మద్దతు ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ నేతలను కోరారు.

టీడీపీ నేతతో బీజేపీ పెద్దల మంతనాలు

కాశినాయన అక్టోబరు 17: బద్వేలు ఉప ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థి సురే్‌షకు మద్దతు ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి టీడీపీ నేతలను కోరారు. ఆదివారం నర్సాపురంలోని కర్నాటి వెంకటరెడ్డితో కలిసి అభ్యర్థించారు. ఈసందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఈప్రాంతంలో వైసీపీ దౌర్జన్యాలు, కక్ష్యసాధింపు చర్యలు మాదృష్టికి వచ్చాయని, వాటిని ధీటుగా ఎదుర్కొంటామని పార్టీ తరుపున వెంకటరెడ్డికి హామి ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో అధికారులు ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా నిజాయితీగా పనిచేయాలన్నారు. అవకతవకలు జరిగితే బీజేపీ చూస్తూ ఊరుకొనే ప్రసక్తిలేదని హెచ్చరించారు. ఎన్నికలకు కేంద్ర బలగాలను మోహరించే విధంగా చూస్తామన్నారు. బీజేపీకి మద్దతు విషయంపై వెంకటరెడ్డిని వివరణ కోరగా బీజేపీ నేతలు తనను కలిసి మద్దతు కోరిన విషయం వాస్తవమే అన్నారు. ఎటూ టీడీపీ పోటీలో లేనందున తమ కార్యకర్తలతో చర్చించి ఉప ఎన్నికల్లో మద్దతుపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. 

 

Updated Date - 2021-10-18T05:58:38+05:30 IST