బీజేపీ పూర్తి స్థాయి జిల్లా కమిటీ ఎన్నిక

ABN , First Publish Date - 2021-10-17T05:23:54+05:30 IST

భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వీరబ్రహ్మచారి గత జూలై 19న ఎన్నిక కాగా, మిగతా కమిటీని శనివారం ఎంపిక చేశారు.

బీజేపీ పూర్తి స్థాయి జిల్లా కమిటీ ఎన్నిక

మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), అక్టోబరు 16 : భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా వీరబ్రహ్మచారి గత జూలై 19న ఎన్నిక కాగా, మిగతా కమిటీని శనివారం ఎంపిక చేశారు. ఆ మేరకు బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పాలమూరు జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు జిల్లా ఇన్‌చార్జి భరత్‌ గౌడ్‌ కమిటీ సభ్యులను ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శులుగా పి. శ్రీనివాస్‌ రెడ్డి, జి. ప్రతాప్‌ రెడ్డి, నంబిరాజు, ఉపాధ్యక్షులుగా ఎస్‌. కృష్ణ వర్దన్‌రెడ్డి, పడాకుల సత్యం, గట్టు మల్లేష్‌, కిష్ట్యా నాయక్‌, రాపోతుల శ్రీనివాసులు గౌడ్‌, రాజేశ్వర్‌. కార్యదర్శులుగా క్రిష్ణబాయ్‌, నిరంజనమ్మ, కె. నారాయణ్‌ రెడ్డి, ఎన్‌. బుచ్చిరెడ్డి, నందీశ్వర్‌, అశోక్‌ గుప్త, కోశాధికారిగా పాండురంగారెడ్డి, ప్రతినిధులుగా గడ్డం గోపాల్‌, సురేందర్‌ రెడ్డి, సామాల నర్సిములు, గాల్‌రెడ్డి, ఎన్‌. రమేశ్‌, రమేశ్‌ కండూర్‌, మహేశ్‌, సుబ్రమణ్యం. యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కిరణ్‌ కుమార్‌ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలిగా పద్మవేణి, కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కొంగలి శ్రీకాంత్‌, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడిగా గోవింద్‌ నాయక్‌, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నయీం, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రామకృష్ణ, ఐటీసెల్‌, సోషల్‌ మీడియా కన్వీనర్‌గా బుట్ట అవినాష్‌ ఏకగ్రీవంగా ఎంపికయ్యారని ఆయన తెలిపారు.


Updated Date - 2021-10-17T05:23:54+05:30 IST