రైతులకు రుణమాఫీ చేసింది బీజేపీనే: అమిత్ షా

ABN , First Publish Date - 2022-02-03T21:41:58+05:30 IST

చక్కెర రైతులకు ఒక లక్షా 48 వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేశాం. ముడి చక్కెర దిగుమతిపై సుంకం విధించడంతో చెరకు రైతులకు ముందస్తు చెల్లింపులు చేసింది. అలాగే చెరకు, చక్కెర ధరలను పెంచాము. ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి చెరుకు ఫ్యాక్టరీలను ప్రోత్సహించే పని బిజెపి ప్రభుత్వం చేసింది..

రైతులకు రుణమాఫీ చేసింది బీజేపీనే: అమిత్ షా

లఖ్‌నవూ: రైతులకు రుణమాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని ఏర్పాలు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు బీజేపీ ఎంతగానో చేసిందని, గత ప్రభుత్వ హయాంలో రైతులను దోచుకోవడం తప్పితే చేసిందేమీ లేదని విమర్శించారు.


‘‘చక్కెర రైతులకు ఒక లక్షా 48 వేల కోట్ల రూపాయలు చెల్లింపులు చేశాం. ముడి చక్కెర దిగుమతిపై సుంకం విధించడంతో చెరకు రైతులకు ముందస్తు చెల్లింపులు చేసింది. అలాగే చెరకు, చక్కెర ధరలను పెంచాము. ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి చెరుకు ఫ్యాక్టరీలను ప్రోత్సహించే పని బిజెపి ప్రభుత్వం చేసింది’’ అని అమిత్ షా అన్నారు. ఇక గత ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఎస్పీ, ఎస్పీ ప్రభుత్వాల హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. ఆ ప్రభుత్వాల సమయంలో రైతు ఆత్మహత్యలు అనేకంగా చూసేవాళ్లమని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరప్రదేశ్‌లో అలాంటివేమీ కనిపించడం లేదని అమిత్ షా అన్నారు.

Updated Date - 2022-02-03T21:41:58+05:30 IST