TS News: బీజేపీపై మండిపడిన మంత్రి హరీష్రావు
ABN , First Publish Date - 2022-07-22T22:04:16+05:30 IST
బీజేపీ (BJP)పై మంత్రి హరీష్రావు (Harish Rao) మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
సంగారెడ్డి: బీజేపీ (BJP)పై మంత్రి హరీష్రావు (Harish Rao) మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్నాటక (Karnataka)లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంది, తెలంగాణ (Telangana)లో ఉన్న పథకాలు కర్నాటకలో ఎందుకులేవు? అని ప్రశ్నించారు. బీజేపీ అంటేనే జూటా పార్టీ... జూటా మాటలని మండిపడ్డారు. తెలంగాణలో రైతులకు పంట పెట్టుబడి సాయం ఇస్తున్నామని, కర్నాటకలో రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మీ ఉందా? అని హరీష్రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ (TRS), బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని కమలం నేతలు చెబుతున్నారు. ఇదే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించేందుకు టీఆర్ఎస్ను ఢీ కొంటున్నారు. టీఆర్ఎస్ నేతలు కూడా ఏమాత్రం తగ్గకుండా బీజేపీని గట్టిగా ఎదుర్కోవాలని భావిస్తున్నారు.