సైబర్‌క్రైమ్స్‌లో బీజేపీ ఐటీసెల్‌ ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-13T14:11:49+05:30 IST

రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అక్రమంగా రూ.600కోట్లు ఆర్జించారంటూ ...

సైబర్‌క్రైమ్స్‌లో బీజేపీ ఐటీసెల్‌ ఫిర్యాదు

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : రెండు రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అక్రమంగా రూ.600కోట్లు ఆర్జించారంటూ ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేసిన ఆ పార్టీ తెలంగాణ ఐటీ సెల్‌ తాజాగా శుక్రవారం మరో ఫిర్యాదు చేసింది. సంజయ్‌పై రూపొందించిన ఫేక్‌ వీడియోను ట్విట్టర్‌లో  వైరల్‌ చేస్తున్నారని, బాద్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్స్‌ అదికారులను కోరింది. కాగా తమ ఛానల్‌ లోగోను, ఔట్‌పుట్‌ను అచ్చుగుద్దినట్లు కాపీ చేసి ఫేక్‌ వీడియో క్రియేట్‌ చేశారంటూ ఛానల్‌ ప్రతినిధులు హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. 

Read more