Congressలోకి చెన్నపట్టణ బీజేపీ, జేడీఎస్‌ నేతలు

ABN , First Publish Date - 2022-05-13T17:30:48+05:30 IST

అధికార బీజేపీకి షాక్‌ తగిలింది. బీజేపీ, జేడీఎ స్‌లకు చెందిన పలువురు నేతలు గురువారం కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో జరిగిన

Congressలోకి  చెన్నపట్టణ బీజేపీ, జేడీఎస్‌ నేతలు

బెంగళూరు: అధికార బీజేపీకి షాక్‌ తగిలింది. బీజేపీ, జేడీఎ స్‌లకు చెందిన పలువురు నేతలు గురువారం కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు డీకే శివకుమార్‌ వీరికి పార్టీ జెండాను అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. చెన్నపట్టణానికి చెందిన ప్రసన్న పి.గౌడ, బుక్కసాగర కుమార్‌, ప్రకాష్‌, శాశ్వత్‌ గౌడ నిసార్‌ సోహెబ్‌, సంతోష్ కుమార్‌ తదితరులు వీరిలో ఉన్నారు. వీరి రాకతో చెన్నపట్టణలో పార్టీ మరింత బలపడుతుందని డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేష్‌, రామనగర జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు గంగాధర్‌, చెన్నపట్టణ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రమోద్‌ తదితరులు హాజరయ్యారు.

Read more