జిన్నాటవర్‌పై బీజేపీ రాద్ధాంతం సరికాదు: సుచరిత

ABN , First Publish Date - 2022-01-01T00:27:46+05:30 IST

స్వాతంత్ర్యానికి ముందే నిర్మించిన ఎంతో చరిత్రాత్మకమైన కట్టడం గుంటూరులోని జిన్నాటవర్‌ అని, దీనిపై బీజేపీ నేతలు ఇప్పుడు రాద్ధాంతం చేయటం సరికాదని రాష్ట్ర

జిన్నాటవర్‌పై బీజేపీ రాద్ధాంతం సరికాదు: సుచరిత

గుంటూరు: స్వాతంత్ర్యానికి ముందే నిర్మించిన ఎంతో చరిత్రాత్మకమైన కట్టడం గుంటూరులోని జిన్నాటవర్‌ అని, దీనిపై బీజేపీ నేతలు ఇప్పుడు రాద్ధాంతం చేయటం సరికాదని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత హితవుపలికారు.   శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందించారు. స్వాతంత్రానికి ముందే నిర్మించిన జిన్నాటవర్‌పై ఇప్పుడు ఏదో ఆశించి వ్యాఖ్యలు చేయటం ఎవరికైనా మంచి పద్ధతి కాదన్నారు. మనది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని, అన్ని కులాలు, మతాల వారు కలిసి మెలిసి సోదరభావంతో మెలుగుతున్నారన్నారు. స్వాతంత్రానికి పూర్వం ఎంతో మంది మన దేశాన్ని పాలించారని, అప్పటి పరిస్థితులు, త్యాగాలను బట్టి అనేక నిర్మాణాలు జరిగాయని సుచరిత తెలిపారు.

Updated Date - 2022-01-01T00:27:46+05:30 IST