బీజేపీ అభ్యర్థికి Z కేటగిరి భద్రత
ABN , First Publish Date - 2022-02-16T21:32:05+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని కర్హల్ నియోజకవర్గం అభ్యర్థి, కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్..
లక్నో: ఉత్తరప్రదేశ్లోని కర్హల్ నియోజకవర్గం అభ్యర్థి, కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బఘెల్కు 'జడ్' కేటరిగి భద్రతను కల్పించినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారంనాడు తెలిపాయి. ఈ కేటగిరి కింద బఘెల్కు సీఐఎస్ఎఫ్ బలగాలు భద్రత కల్పిస్తాయి.
ఉత్తరప్రదేశ్లోని మణిపురి జిల్లా అత్తికుల్లాపూర్ గ్రామం సమీపంలో మంగళవారం సాయంత్రం బఘేల్ కాన్వాయ్పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేసిన ఘటన సంచలనమైన నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచారు. బఘెల్ ఇంతవరకూ ''వైప్లస్'' భద్రతా కేటగిరిలో ఉన్నారు. కాగా, కర్హల్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా బఘెల్ పోటీ చేస్తుండగా, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవద్ సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ గూండాలే బఘెల్ కాన్వాయ్పై రాళ్ల దాడి చేసినట్టు యూపీ ఉప ముఖ్యమంత్రి కేపీ మౌర్య ఆరోపించారు. ఈ దాడిలో బఘెల్ గాయపడనప్పటికీ, ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి.