BJP Leader: కేంద్రం ఇచ్చిన బియ్యం ఎటు వెళ్లాయన్న లంకా దినకర్
ABN , First Publish Date - 2022-08-04T17:34:57+05:30 IST
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పంచని బియ్యం ఎటు వెళ్లాయని బీజేపీ నేత లంకా దినకర్ ప్రశ్నించారు.
అమరావతి: కేంద్ర ప్రభుత్వం(Central government) ఇచ్చిన బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (AP Government) ప్రజలకు పంచని బియ్యం ఎటు వెళ్లాయని బీజేపీ (BJP) నేత లంకా దినకర్ (Lanka dinakar) ప్రశ్నించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... గత మూడు సంవత్సరాల్లో పేదలకు కేంద్ర ప్రభుత్వ సహాయంలో 5.66 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎటు దారి మళ్ళాయని నిలదీశారు. గతంలో వైన్ షాపులలో లిక్కర్ బ్లాక్ మార్కెట్ వెళ్లిందని ఆరోపిస్తే ఎలుకలు తాగడం వల్ల స్టాక్ మాయమయిందన్నారు.. మరి పేదల బియ్యం ఏ పందికొక్కులు మింగాయని యెద్దేవా చేశారు. యూపీ వంటి చాల రాష్ట్రాలు కేంద్రం నుండి వచ్చిన బియ్యం కన్నా అధికంగా ప్రజలకు పంచితే, మన రాష్ట్రంలో పేదల నోటికాడ కూడు పక్క దోవ పట్టిందని లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.