రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి: Bandi sanjay

ABN , First Publish Date - 2022-06-06T19:25:16+05:30 IST

రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు.

రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలి: Bandi sanjay

హైదరాబాద్: రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌(KCR)కు బండి సంజయ్ లేఖ రాశారు. జూన్ నెలాఖరు లోపు నిధులు విడుదల చేయకపోతే ఆందోళనలు చేస్తామన్నారు. బీసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి ర్యాంకుల నిబంధన ఎత్తివేసి అర్హులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని అన్నారు. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-06T19:25:16+05:30 IST