TS News: భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకుల అరెస్ట్లను ఖండించిన బండి సంజయ్
ABN , First Publish Date - 2022-09-06T16:50:48+05:30 IST
నగరంలోని ట్యాంక్బండ్పై ర్యాలీ నిర్వహించిన భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను అరెస్ట్ చేయాలన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: నగరంలోని ట్యాంక్బండ్పై ర్యాలీ నిర్వహించిన భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను అరెస్ట్ చేయాలన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) తీవ్రంగా ఖండించారు. గణేష్ నిమజ్జన (Immersion of Ganesh) ఉత్సవాలను ప్రశాంతంగా జరపాలని అడిగితే అరెస్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. హిందువుల పండుగలను ప్రశాంతంగా జరగనియ్యరా?.. అందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేయాలని అడిగితే అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రశాంతంగా వినాయక నిమజ్జనం జరగాలని తాము అనుకుంటున్నామని.. రాచిరంపాన పెట్టాలని సీఎం (CM KCR) చూస్తున్నారని ఆరోపించారు. ఇతర వర్గాల పండుగలకు రాని ఇబ్బందులు హిందువుల పండుగలకే ఎందుకు? అని నిలదీశారు. హిందూ సమాజమంతా ఆలోచించాలని కోరుతున్నట్లు తెలిపారు. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని బండి సంజయ్ పిలుపునిచ్చారు.