Bandi sanjay: మరమనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా?

ABN , First Publish Date - 2022-09-13T17:07:20+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయటాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.

Bandi sanjay: మరమనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly session) నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Etela rajender)ను సస్పెండ్ చేయటాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) తీవ్రంగా ఖండించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మరమనిషి అంటేనే సస్పెండ్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈటల రాజేందర్ (BJP MLA) అన్నదాంట్లో తప్పేముంది అని అడిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడానికే అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు నిర్వహించట్లేదా అని నిలదీశారు. ఈటల సస్పెన్షన్‌పై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. నిండు సభలో ప్రధాని (PM Modi)ని ఫాసిస్ట్ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు అసెంబ్లీ నడిపే అర్హత సీఎం కేసీఆర్‌కు లేదన్నారు. సీఎంను సభ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్‌ను సస్పెండ్ చేస్తారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 


Updated Date - 2022-09-13T17:07:20+05:30 IST