Bandi Sensational comments: పీఎఫ్ఐను టీఆర్ఎస్ సర్కార్ పెంచి పోషిస్తోంది

ABN , First Publish Date - 2022-09-21T19:45:20+05:30 IST

పీఎఫ్ఐను టీఆర్ఎస్ సర్కార్ పెంచి పోషిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Bandi Sensational comments: పీఎఫ్ఐను టీఆర్ఎస్ సర్కార్ పెంచి పోషిస్తోంది

హైదరాబాద్: పీఎఫ్ఐను టీఆర్ఎస్ సర్కార్ (TRS Government) పెంచి పోషిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. నాగోల్ వద్ద పాదయాత్రలో బండి (BJP state Chief) మాట్లాడుతూ.. 2040 నాటికి భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ (PFI) కుట్ర చేస్తోందని తెలిపారు. ఎంఐఎం (MIM) కనుసన్నల్లో పీఎఫ్ఐ నడుస్తోందని అన్నారు. జిమ్, స్వచ్ఛంద సంస్థల పేరుతో పీఎఫ్‌ఐ విస్తరిస్తోందని.. హిందువుల తలలు నరుకుతున్న పీఎఫ్ఐ సంస్థ తెలంగాణ(Telangana)లో విస్తరిస్తుంటే కేసీఆర్‌ (Telangana CM)కు సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. ఎన్ఐఏ(NIA) వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి సర్కార్‌కు సోయి ఎందుకు లేదని నిలదీశారు. హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర...

కేంద్రం ఇండ్లు మంజూరు చేసినా  కేసీఆర్ (TS CM) లెక్క చెప్పడం లేదని... భూములున్నా పట్టాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల బంద్‌తో వేలాది మంది బాధితులు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు.  కేసీఆర్ కుటుంబాని (KCR Family)కి లంచాలిస్తే తప్ప పనులు కాని దుస్థితి ఏర్పడిందన్నారు. కుక్క తోక వంకర తరహాగా కేసీఆర్ తీరు ఉందని వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లను అరెస్ట్ చేసి జైళ్లో పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర ఉందని ఆరోపించారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న కేసీఆర్.... లిక్కర్ స్కాంపై నోరెందుకు మెదపవని ప్రశ్నలు సంధించారు. సీబీఐ (CBI), ఈడీ (ED) దాడులు చూసి కేసీఆర్ కుటుంబం క్వారంటైన్ పోతోందని యెద్దేవా చేశారు. సీఎం కుటుంబాన్ని తెలంగాణ పొలిమెర దాటేదాకా తరిమి తరిమి కొట్టేదాకా విశ్రమించబోమని బండి సంజయ్(BJP Leader) వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-09-21T19:45:20+05:30 IST