Bandi sanjay: టీఆర్ఎస్ దాడులకు భయపడేదే లేదు

ABN , First Publish Date - 2022-08-15T19:27:59+05:30 IST

టీఆర్ఎస్ దాడులకు భయపడేదే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Bandi sanjay: టీఆర్ఎస్ దాడులకు భయపడేదే లేదు

జనగామ: టీఆర్ఎస్ (TRS) దాడులకు భయపడేదే లేదని బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi sanjay) స్పష్టం చేశారు.  దేవరుప్పులలో జరిగిన ఘటనపై సంజయ్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ... అడుగడుగునా పోలీసుల వైఫల్యం కనిపిస్తోందన్నారు. ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్‌ (KCR) పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ పాలన రజాకార్లను తలపిస్తోందన్నారు. విస్నూర్ దొరను తరిమికొట్టినట్లు.. కేసీఆర్‌నూ ప్రజలు తరిమికొడతారని అన్నారు. వరంగల్‌లో మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏమైందని బండి సంజయ్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2022-08-15T19:27:59+05:30 IST