సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2021-09-15T17:28:39+05:30 IST

ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భ్రుతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు.

సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ బహిరంగ లేఖ

మెదక్: ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భ్రుతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం వెంటనే శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగంలోచి తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భ్రుతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని ప్రచారం చేసిన కేసీఆర్, తన కుటుంబం, వారి బంధువులకు డజను ఉద్యోగాలిచ్చారని విమర్శించారు. నిరుద్యోగ భ్రుతి కింద విద్యావంతులైన యువతీ, యువకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుద్యోగికి రూ.లక్ష బకాయి పడ్డారన్నారు.  నిరుద్యోగ భ్రుతి కింద ఇవ్వాల్సిన రూ.లక్షను నిరుద్యోగ వెంటనే అందించాలని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-15T17:28:39+05:30 IST