Bandi sanjay: ఆరవ రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2022-09-18T17:20:53+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర ఆరవ రోజు మల్కాజ్‌గిరి నుంచి ప్రారంభమైంది.

Bandi sanjay: ఆరవ రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) పాదయాత్ర ఆరవ రోజు మల్కాజ్‌గిరి నుంచి ప్రారంభమైంది. బీజేపీ సహా ఇంచార్జ్ అరవింద్ మీనన్ (Anand meenan) పాదయాత్రలో పాల్గొన్నారు. కాసేపట్లో మల్కాజిగిరి చొరస్తా వద్ద ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించనున్నారు. మల్కాజ్గిరి క్రాస్ రోడ్డు నుంచి ఎల్ కె హాస్పిటల్ రోడ్, జేఎన్‌టీ పాయింట్, ఆనంద్ బాగ్ క్రాస్ రోడ్స్, సఫిల్‌గూడా క్రాస్ రోడ్స్, వినాయక నగర్ క్రాస్ రోడ్డు, నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్, సాయిబాబా మందిరం రోడ్స్, యాప్రాల్ క్రాస్ రోడ్స్ మీదుగా డీఎన్ఆర్ గార్డెన్స్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. డీఎన్ఆర్ గార్డెన్స్ సమీపంలో బండి సంజయ్ (Telangana BJP Chief) రాత్రి బస చేయనున్నారు. మొత్తం 10.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. కేంద్రమంత్రి అమిత్ షా (Union minister Amith shah) పర్యటన నేపథ్యంలో నిన్న పాదయాత్రకు బండి సంజయ్ విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. 

Updated Date - 2022-09-18T17:20:53+05:30 IST